‘రాధే శ్యామ్ ‘ ఫస్ట్ సింగిల్ అదుర్స్..

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ‘రాధేశ్యామ్’ చిత్రం నుంచి తొలి పాట లిరికల్ వీడియో రిలీజైంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. “ఈ రాతలే” అంటూ సాగే లవ్లీ సాంగ్ ను నేడు లిరికల్ వీడియో రూపంలో విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. ‘రాధేశ్యామ్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో వస్తోంది.