ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన షేక్ రఫీ

సత్తెనపల్లిలో ఆదివారం జరగబోయే ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని నకరికల్లు మండల వైస్ ప్రెసిడెంట్ షేక్ రఫీ. ఈ నెల 8వ తేదీ, ఆదివారం ఉదయం 10 గంటలకు సత్తెనపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డులో(గజ్జల ఆసుపత్రి ఎదురు) గల జనసేనపార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో “నియోజకవర్గ జనసేనపార్టీ ముస్లీం-మైనార్టీ ఆత్మీయ సమావేశం” జరుగునని నియోజకవర్గంలోని జనసైనికులైన ముస్లీం సోదర సోదరీమణులు, జనసేనపార్టీ సానుభూతిపరులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులు, వీరమహిళలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది.