బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి: జాగరపు పవన్ కుమార్

అరకు నియోజకవర్గం: పెదబయలు మండలం, జమ్మూగూడ పంచాయతీలో సుమారు ఐదు గ్రామలు ఉన్నాయి. ఆ గ్రామాలకు వెళ్లాలంటే పెద్దగడ్డ ఉంటుంది. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నా, గిరిజనుల సమస్యలు మాత్రం ఎక్కడ సమస్యలు అక్కడే అన్న చందాన ఉన్నాయి. గిరిజన ప్రాంతంలో వైద్యం కోసం హాస్పిటల్ కి వెళ్ళాలి అంటే ఇప్పటికీ డోలుమోతల ప్రయాణం కొన సాగుతుంది. ఈ ప్రభుత్వం వెంటనే ఈ బ్రిడ్జి యొక్క సమస్యను పరిష్కరించాలని, మంజూరు చేయాలని జనసేన పార్టీ పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ కోరడం జరిగింది.