సెల్యులర్ టవర్ ఏర్పాటు చేయాలని వనబంగి ప్రాంత ప్రజల విన్నపం
అల్లూరిసీతారామరాజు జిల్లా పెదబయలు మండలం వనబంగి గ్రామపంచాయితిలో సెల్యులర్ సిగ్నల్స్ లేని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రస్తుతం ఏ పనులైన కూడా ఆన్ లైన్ అంతర్జాలం సౌకార్యం లేకపోతే సేవలు అస్తవ్యస్తం అవుతుంది. కనీసం అంబులెన్స్ కి పోన్ చేద్దామన్నా కూడా అవ్వని దీనస్థితి అధికారులు తప్పకుండా ఈ సెల్యులర్ టవర్ ఏర్పాటు చేసి సుమారు 11 గ్రామాలకు సెల్యులర్ సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు విన్నవించుకుంటున్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-17-at-16.55.41-1024x461.jpeg)