యాడికి పట్టణంలో పర్యటించిన జెసి, జనసేన శ్రీకాంత్

తాడిపత్రి: బాబు స్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం యాడికి పట్టణం, టీచర్స్ కాలనీ, శాంతి నగర్ లో తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జెసి అష్మిత్ రెడ్డి గారు పర్యటించి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జెసి అష్మిత్ రెడ్డి వెంట తాడిపత్రి నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త కదిరి శ్రీకాంత్ రెడ్డి, నరసింహచారి ఉన్నారు. ఈ కార్యక్రమంలో యాడికి మండల టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, జెసి అనుచరులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.