నర్సిరెడ్డి పల్లె గ్రామంలో పర్యటించిన బెల్లంకొండ సాయిబాబా

కంభం మండలం, నర్సిరెడ్డి పల్లే గ్రామంలో రాములవారి దేవాలయంను దర్శించి అనంతరం ఆ గ్రామంలో గిద్దలూరు జనసేన ఇంచార్జ్ బెల్లంకొండ సాయి బాబా పర్యటించారు, గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కడుతున్నవిదానం, రైతు భరోసా యాత్రలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు లక్ష రూపాయలు ఇస్తున్న విషయమును.. జనవాని ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లడం వీటన్నిటిని జనసేన ఇన్చార్జి బెల్లంకొండ సాయి బాబా ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు, మండల నాయకులు జనసేన కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.