రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం

అకాల వర్షాలతో దెబ్బతిన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు తూర్పుగోదావరి జిల్లా పర్యటన నిమిత్తం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కడియం మండలం ఆవ బయలుదేరారు. అక్కడ రైతుల్ని పరామర్శించి వారి కష్టాలు తెలుసుకుంటారు. పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆయనతో ఉన్నారు. అంతకు ముందు విమానాశ్రయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణతోపాటు వివిధ నియోజకవర్గాల ఇంచార్జిలు, రాష్ట్ర, ఉభయ గోదావరి జిల్లాల కమిటీ సభ్యులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.