పిఠాపురంలో జనసేన పార్టీ బలోపేతం దిశగా దూసుకుపోతున్న మాకినీడి శేషుకుమారి..!!!

జనసేన పార్టీ తీర్థం తీసుకున్న వైయస్సార్ మరియు టిడిపి కార్యకర్తలు

జనసేన పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు పట్నంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో గొల్లప్రోలు పట్నంలో వినుకొండ అమ్మాజీ, పేకేటి బాబి,అనంతపల్లి మేరీ, అరకు శ్రీనివాస్, మరదలా శ్రీనివాస్, గొల్లప్రోలు పట్నం జనసైనికుల కృషి ఫలితంగా 100 మందికి జనసేన పార్టీ కండువా కప్పి ఇన్చార్జి మాకినీడి శేషుకుమారి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ వారి ఆశయాలు ఆదర్శాలకు అనుకూలంగా మేము సైతం అని మీ బాటలో అడుగు వేస్తామని నాయకులు యువకులు ముందుకు రావడం జరిగింది. ఇలాగే మన జనసైనికులు ప్రతి ఒక్కరు పనిచేసి జనసేన పార్టీకి బలంగా నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా సుమారు 60 మంది అక్క చెల్లెమ్మలు, 40 మంది అన్నదమ్ములు యువకులు సుమారుగా 100 జనసేన పార్టీ కండువా వేసి పిఠాపురం ఇన్చార్జి మాకినీడి శేషుకుమారి ఆహ్వానించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారి వెంట నడుస్తామని చెప్పడం చాలా ఆనందంగా ఉందని రాను రాను పిఠాపురం నియోజకవర్గంలో వీరమహిళల సంఖ్య పెరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరూ జనసేన పార్టీని కోరుకుంటున్నారని ప్రజలు ఈ వీర మహిళలలే ఉదాహరణ అని తెలియజేస్తున్నాను. పిఠాపురం రాబోయే రోజుల్లో జనసేన జెండా ఎగరవేయడం ఖాయమని అలాగే మీకు ఏ కష్టం ఉన్నా మీ ఇంటి ఆడపడుచులా మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ నా భర్త డాక్టర్ మాకినీడి వీర ప్రసాద్ వారి సేవలు అందిస్తామని భరోసా ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మొగిలి అప్పారావు, కీర్తి చంటి, వినుకొండ అమ్మాజీ, చిన్నగాంధం నవీన్, చిన్నగాంధం శిరీష, ఎం.శ్రీనివాస్, ఏ.శ్రీనివాస్, డి.బంగారం, డి.బుజ్జి, వి.రమణ, ఏ.వెంకటేశ్వరరావు, ఏ.కళ్యాణ్ శివ, ఏ.మారి, ఎం అప్పల కొండ, జి.నాగమణి, పి.వరలక్ష్మి, వి.దేవి, రామిశెట్టి సూరిబాబు, గంజి గోవిందు, కొండపల్లి శివ, కంద సోమరాజు, వాకపల్లి సూర్య ప్రకాష్, కొండపల్లి శివ, జనసైనికులు నాయకులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.