బాధిత కుటుంబానికి రూపాయలు 10,000 ఆర్థిక సహాయం

విజయవాడ సెంట్రల్, 60వ డివిజన్ వాంబే కాలనీ కొత్త అపార్ట్మెంట్స్ పైన విద్యుత్ షాక్ కి గురై 11 ఏళ్ల బాలుడు అక్కడక్కడే మృతి చెందడం జరిగింది. ఆ బాలుడి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగోలేదని అక్కడ స్థానికంగా ఉండే మన జనసైనికుడు వెంకీ తెలియజేసిన వెంటనే జనసేన పార్టీ తరుపున నగర ఉపాధ్యక్షులు కామళ్ళ సోమనాధం ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం ప్రెసిడెంట్స్ యాంపాటి ప్రభుజీ, తాడి దుర్గారావు, జిడగం శ్రీనివాస్, దాసరి నాగరాజు గారు, పైలా ప్రకాష్, గొర్రెల దుర్గారావు, కుప్పాల శ్రీనివాస్, 58వ డివిజన్ ఉపాధ్యక్షులు క్ నరేంద్ర గారు,59వ డివిజన్ ఉపాధ్యక్షులు పిన్నేంటి సతీష్, 59వ డివిజన్ ప్రధాన కార్యదర్శి శంకరాపు సంపత్, 60వ డివిజన్ ప్రధాన కార్యదర్శి షేక్ సిద్ధిక్, 25వ డివిజన్ కార్యదర్శి బైనపాలెం గణేష్, 10వేలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులు జనసేన పార్టీకి కృతఙ్ఞతలు తెలియజేసారు.