దూసుకుపోతున్న బత్తుల – మహాపాదయాత్ర 100వ రోజు

  • చక్రద్వారబంధం గ్రామంలో జనంకోసం జనసేన మహాపాదయాత్ర 100 వ రోజు

రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో తోడుగా ఉండేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జనంకోసం జనసేన – మహా పాదయాత్ర” మరో మైలురాయిని చేరుకుని గురువారం 100 రోజులు పూర్తిచేసుకుంది. చక్రద్వారబంధం గ్రామంలో ఏర్పాటు చేసిన 100 వ రోజు జనంకోసం జనసేన మహాపాదయాత్రలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి భారీ బైక్ ర్యాలీగా సుమారు 2000 మంది జనసేన శ్రేణులతో కలిసి నడుస్తూ ఎంతో వైభవంగా పాదయాత్రను ప్రారంభించారు. గ్రామ ప్రజలు బత్తుల దంపతులపై పూల వర్షం కురిపిస్తూ, హారతులతో అఖండ స్వాగతం పలికి వారిపై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం భారీగా తరలివచ్చిన జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులతో కలిసి చక్రద్వారబంధం గ్రామంలో ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రతీ కుటుంబాన్ని సొంత కుటుంబ వ్యక్తిలా పలకరిస్తూ కష్ట సుఖాలు తెలుసుకుంటూ పాదయాత్ర ముందుకు సాగింది. జనంకోసం జనసేన మహాపాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్లో పాల్గొని జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులతో కలిసి బత్తుల కేక్ ని కట్ చేయడం జరిగింది. రాజానగరం నియోజకవర్గంలో మునుపెన్నడు లేని విధంగా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తూ, నిత్యం జనంలోనే ఉంటూ, ప్రజల కష్ట సుఖాల్లో ఎల్లపుడు తోడుగా ఉంటూ, నాయకులు అంటే ఇలా ఉండాలి అని నిరూపించిన నాయకులు బత్తుల. బాలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఇలాంటి నాయకులే నేటి సమాజానికి ఎంతో అవసరం అని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ పాదయాత్రలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.