ధర్మవరంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ధర్మవరం, జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్మవరం పట్టణంలోని ఎన్.టి.ఆర్ సర్కిల్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం చిలకం మధుసూదన రెడ్డి సతీమణి చిలకం ఛాయాదేవి కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు,కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.