కాశీవిశ్వేశ్వరునికి అన్నాభిషేకం నిర్వహించిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గంలోని 5వ డివిజన్, శ్రీరామ్ నగర్ కాలనీ లో కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీ సువర్చలా సహిత శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీకాశీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర వారి దేవస్థాన ఆలయ గౌరవ అధ్యక్షులు రెడ్డి అప్పల నాయుడు మరియు ఆలయ కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యంలో 109 కేజీల అన్నంతో వేదపండితులు ఘనంగా అన్నాభీషేకాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఈ అన్నాభిషేకంలో విశేషంగా భక్తులు తరలివస్తున్నారు. చాలా బృహత్తరమైన విశేషమైన కార్యక్రమం ఈ అన్నాభిషేకం.. ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజలు భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం అని తెలిపారు.