వీరఘట్టం మండలంలో ఘనంగా 11వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం

మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలంలో 11వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జనసేన నాయుకులు గిరిజన నేత పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నిమ్మల నిబ్రమ్ ఆదేశాలు మేరకు వీరఘట్టం మండలంలో జనసేన పార్టీ 11 వ ఆవిర్భావం సందర్బంగా బి.ఎం.ఆర్ సెంటర్లో జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్బంగా వీరఘట్టం పట్టణ నాయకులు అచ్యుత్ మాట్లాడుతూ మంచి మనసుతో కొత్తతరం భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ స్థాపించిన పార్టీ అడుగుజాడలో నడవాలన్న ఆశయంతో ముందుకు వచ్చిన పాలకొండ నియోజకవర్గానికి చెందిన చెందిన ఎస్.టి గిరిజన నేత నిమల నిబ్రమ్ జనసేన పార్టీలోకి రావడం నియోజకవర్గం బలమైనది అలానే పార్టీ అధిష్టానం కూడా ఆయనను గౌరవించి సమన్వయ కర్తగా నియమించడం చాలా సంతోషం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారిపల్లి అచ్యుత్ రావు, ఉదయాన చరణ్, నందివాడ పండు, వద్దపల్లి సురేష్, కనపకాల విష్ణు మరియు ఇతర జనసైనికులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది.