నూతన సీఐ జి.ప్రకాష్ కుమార్ కి ఘనస్వాగతం పలికిన జనసేన

నందికొట్కూరు నియోజకవర్గంలోని జనసేన నాయకులు మరియు జనసైనికులు కలిసి నూతనంగా సిఐగా బాధ్యతలు స్వీకరించిన జి. ప్రకాష్ కుమార్ కి పూలమాలలు వేసి శాలువాతో సన్మానించి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నల్లమల రవికుమార్, మధు, పారుమంచాల రాజు, పుష్ప రాజు, మూర్తి జావలి, చిన్నా, మహేష్, రాధాకృష్ణ, ప్రేమ రాజు, జగదీష్, వెంకటేశ్వర్లు, బలరాం తదితరులు పాల్గొనడం జరిగింది.