మహిళలతో జనసేన మాటామంతీ 16వ రోజు

అనంతపురం అర్బన్ నియోజకవర్గం: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటా మంతి కార్యక్రమంలో భాగంగా 16వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 22వ డివిజన్ బుడ్డప్ప నగర్ లో పర్యటించి ప్రజల నుంచి పలు సమస్యలు తెలుసుకుని ఈ విధంగా మాట్లాడారు. జగన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను అన్ని రంగాలను సర్వనాసం చేసి రాష్ట్ర స్తుల ఆదాయాన్ని క్షీణింప చేసి ఇప్పుడు సిద్దం అంటూ ప్రజలముందుకు వస్తు ప్రజలను మబ్యపెట్టాలని చూస్తున్నాడని అయినప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని, ఉద్యోగ ఉపాధి కల్పన లేక నిరుద్యోగిత రేటు పెరిగి రాష్ట్ర ప్రజలు వలసలు వెళ్ళే పరిస్థితులు దాపరించాయని ప్రజలు అన్ని గమనించి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి సగణంపడానికి సిద్ధంగా ఉన్నారని కచ్చితంగా రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమే అని అన్నారు.దీనితో పాటు ఇక్కడ స్థానికంగా బుడ్డప్ప నగర్ కార్పొరేటర్ లీలావతి మొద్దునిద్ర వహిస్తూ డివిజన్ అభివృద్ధిని గాలికి వదిలేసారని.. దీనితో ఇక్కడ మంచింటి, మురుగు కాలువల సమస్యలతో పాటు దోమల బెడద కూడా ఎక్కువే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.