జనసేన పార్టీలో చేరికలు

గజపతినగరం నియోజకవర్గం: గంట్యాడ మండలంలో గజపతినగరం జనసేన నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో, పిట్ట బాలు సమక్షంలో వైసీపీ, టిడిపి నుంచి సుమారు 50 మంది జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరారు. గంట్యాడ మండలంలో కొండతమరపల్లి నుంచి చిన్ని కృష్ణ, వెలగాడ నుంచి రాంబాబు, గింజేరు కోటి నుంచి మరడం నుంచి సురేష్, పెదమించిపాలెం బాల, బొనంగి రవి, గ్రామాల నుంచి యువకులు పార్టీలో చేరారు, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విజయనగరం జిల్లా సీనియర్ నాయకులు డా. రవికుమార్ మిడతన, గజపతినగరం నాయకులు పండు, మహేష్, నాని, కోటి, రాంబాబు, అప్పలరాజు పాల్గొన్నారు.