సర్వేపల్లిలో జనంకోసం జనసేన 17వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం, మనుబొలు మండలంలోని కొండూరు సత్రం పంచాయతీ పరిదిలోని జ్యోతి నగర్ నందు 17వరోజు ఆదివారం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సనందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ 30 కుటుంబాలకి పైన పేద అట్టడుగునా ఉన్న వారు నివాసం ఉంటున్నారు కొంతమందికి ఇల్లు నిర్మిస్తామని చెప్పి ఇళ్ల స్థలాలు బేస్ మెంట్ మాత్రం జరిగింది అక్కడ నుంచి ఒక్క ఇటుక కూడా ముందుకి కొనసాగించి నిర్మాణం చేసి ఇవ్వాలనే ఆలోచన లేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏది కూడా చెప్పింది చెప్పినట్టు చేద్దామనేటువంటి ఆలోచన లేకపోవడం కూల్చడం మున్చడం దోచుకోవడం తప్ప పూర్తిస్థాయిలో సమయానికి పేదలకి నిర్మించి ఇస్తానని చెప్పిన ఇల్లు గాని వారికి కావలసిన కనీస వసతులు కానీ ఏవి కూడా అందించినటువంటి పరిస్థితులు లేవు రాబోయే ఎన్నికల్లో ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్తారు అదేవిధంగా రాబోయేది జనసేన ప్రభుత్వం జనసేన ప్రభుత్వంలో ఏవి కూడా ఆగవు పూర్తిస్థాయిలో చెప్పిన సమయానికి చెప్పిన విధంగా పూర్తి చేసి ఇస్తామని తెలియజేస్తున్నామని సురేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనయ, సుధాకర్, పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, వంశీ, సందీప్, తదితరులు పాల్గొన్నారు.