ఆత్మకూరులో పవనన్న ప్రజాబాట 25వ రోజు

ఆత్మకూరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం శుక్రవారం 25వ రోజుకు చేరుకుంది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎర్రవల్లి చిన్నమ్మ అను నిరుపేద గిరిజన మహిళను కంటి చికిత్స నిమిత్తము హాస్పిటల్లో పరీక్షలు చేయించడం జరిగింది. త్వరలో ఆమెకు కంటి చికిత్స చేయించడం జరుగుతుంది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని, సెంట్ మేరీస్ హాస్పిటల్ కు ఎదురుగా ఉన్న గిరిజన కాలనీలో మరియు జర్నలిస్ట్ కాలనీలో పర్యటించి అక్కడి ప్రజల ఇబ్బందులను తెలుసుకొని జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ భరోసా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా శ్రీధర్ తెలిపారు. సకల సౌకర్యాలతో, ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు జనసేన పార్టీ నాయకులు వంశీ, చంద్ర, తిరుమల, నాగరాజ, పవన్, భాను, అనిల్, హజరత్ తదితరులు పాల్గొన్నారు.