ఆమదాలవలసలో జనంతో జనసేన 26వ రోజు

ఆమదాలవలస నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) నాయకులు మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా 26వ రోజు, సరుబుజ్జిలి మండలం, కనకమయ్య పేట గ్రామంలో ప్రధాన సమస్య త్రాగునీరు ఊర్లో సదుపాయం లేక పక్క ఊరు నుంచి తెచ్చుకుని తాగే దౌర్భాగ్య పరిస్థితిలో గ్రామ ప్రజలందరూ ఉన్నారు. ఈ ఒక్క సమస్య వాళ్లకి తీర్చగలిగితే చాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు జనసేన పోరాటం చేస్తుందని గ్రామ ప్రజలకు భరోసా కల్పించడం జరిగింది. మరియు ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలి, యువత అందరూ కూడా జాబులు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సైరుగాపు సంతోష నాయుడు, జగదీష్, మామిడి సాయి, కిరణ్, కోమల్, మోహన్, ప్రదీప్ మరియు జనసేన కార్యకర్తలు, మరియు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నామని తెలిపారు.