పశ్చిమగోదావరి జిల్లా జనసైనికుల సహాయంతో రైల్వే కోడూరులో నిత్యావసర సరుకుల పంపిణీ

కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల్లో ఇల్లు, సర్వం కొట్టుకుపోయిన సామాన్య ప్రజానీకానికి జనసేన పార్టీ రైల్వేకోడూరు జనసైనికులు పశ్చిమ గోదావరి జిల్లా జనసైనికులు సరఫరా చేసిన నిత్యావసర సరుకులను 30 పేద కుటుంబ ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన పార్టీ నాయకులు నాగేంద్ర మరియు దినకర్ బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలబడటం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిత్యావసరాలు సరఫరా చేసిన తర్వాత జనసైనికులు బైక్ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, రైల్వేకోడూరు జనసైనికులు గంధంశెట్టి దినకర్ బాబు, ముత్యాల కిషోర్, ఎద్దల అనంత రాయలు, పటం రవి, కటికఒ మణి, పగడాల వెంకటేష్, ప్రసాద్, సుబ్బరామయ్య, మాదం సుబ్రహ్మణ్యం, శంకరయ్య, మహేష్, ఉత్తరాది శివ, శివ, నల్లఒ శెట్టి కిషోర్, చవాకుల రెడ్డి మణి స్థానిక జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.