శ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న బత్తుల వెంకటలక్ష్మి

నియోజకవర్గం: కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో ప్రసిద్దిగాంచిన శ్రీ శ్రీ శ్రీ మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ఈ జాతరలో రాజానగరం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని సుమారు 1000 మంది ఆడపడుచులతో కలిసి గరగలు మరియు బోనాలుతో శ్రీరంగపట్నం గ్రామంలో భారీ ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి గుడికి చేరుకుని దర్శించుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న 1000 మంది ఆడపడుచులకు అందరికీ ఒక జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, గాజులు అందజేశారు. ఈ సందర్భముగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ మాతృశ్రీ మోదకొండమ్మ తల్లి అమ్మవారి జాతరలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. ఆ తల్లి దయ చల్లటి చూపు రాజానగరం నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని.. ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని.. రాష్ట్రంలో దుష్ట పాలన పోయి ప్రజలు ఆనందంగా జీవించే సుపరిపాలన రావాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలియజేసారు.. ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, జనసైనికులు, వీరమహిళలు, గ్రామా ప్రజలు భారీగా పాల్గొన్నారు.