జనసేన జనజాగృతి యాత్ర 30వ రోజు

రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు జనసేన జనజాగృతి యాత్రలో భాగంగా ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరిచర్ల విజయ్ శంకర్ అధ్యక్షతన సీతానగరం మండలం, నాగంపల్లి గ్రామంలో జనసేన పార్టీ గాజు గ్లాసు & షణ్ముఖ వ్యూహం కరపత్రాలు ప్రతి ఇంటికి అందించడం జరిగింది. ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి ఇల్లు, ప్రతి మనిషి లో మార్పు రావాలని ఈ జన జాగృతి యాత్ర ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ వీరమహిళ కందికట్ల అరుణ కుమారి, సీతానగరం మండలం ప్రధాన కార్యదర్శి & దళిత నాయకులు చిడిపి నాగేష్మ, నాగంపల్లి గ్రామ జనసేన పార్టీ నాయకులు గాజుమోగ్గాలా, పెద్ద నవీన్, చిన్న నవీన్, నరేంద్ర జనసైనికులు, జనసేన పార్టీ సానుభూతిపరులు పాల్గొన్నారు.