జనంకోసం జనసేన 310వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 310వ రోజులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి ఆధ్వర్యంలో జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం వెంకటాపురం, రామన్నపాలెం, చిన్నూరు మరియు రామానుజపురం గ్రామాలలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా మంగళవారం 500 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 71795 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల అద్యక్షులు ఉంగరాల మణిరత్నం, దేవిపట్నం మండల అధ్యక్షులు చారపు వెంకట రాయుడు, గోకవరం మండల కార్యదర్శి ముల్లపాక విజయ్ కుమార్, వెంకటాపురం గ్రామం నుండి తుర్రం చల్లన్న దొర, పండా అరుణ్ కుమార్, పండా దుర్గాప్రసాద్, అడ్డాల చరణ్ దొర, నక్క లక్ష్మణ్ దొర, చిన్నూరు నుండి సరాపు శివరామకృష్ణ, చొడి భార్గవ్, చోడి భవాని శంకర్, కృష్ణునిపాలెం నుండి కరిబండి సాయి పవన్, ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామ అధ్యక్షులు తైలం రమేష్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి కృతజ్ఞతలు తెలియజేసారు.