అంబటి ఆధ్యర్యంలోనే అక్రమ మైనింగ్ తవ్వకాలు: గాదె

సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతుందని, అధికారులు కూడా ఎమ్మెల్యేకి వత్తాసు పలుకుతున్నారని జిల్లా అధ్యక్షుడు గాదె మండిపడ్డారు. రాజుపాలెం మండలం భీరవల్లిపాయ్ గ్రామంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తో కలసి సందర్శించడం జరిగింది. అక్కడ అక్రమంగా పెద్ద పెద్ద ప్రొక్లెయిన్ తో తవ్వి తరలిస్తున్నారని, కొండలని కూడా తవ్వుతూ అక్రమ సంపాదనకు తెగబడుతున్నారని, ఎమ్మెల్యే ధన దాహానికి మట్టి తవ్వకాలు అడ్డాగా మారాయని అన్నారు. మైనింగ్ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా చేసురున్నారని, ఇకపై ఇటువంటి చర్యలు జరగడానికి వీల్లేదని గాదె హెచ్చరించారు. జనసేన పార్టీ ఇకపై ఈ మట్టి తవ్వకాలపై జరుగకుండా అడ్డుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.