నీలంపేట గ్రామంలో 32వ రోజు జనంతో జనసేన

  • బూర్జ మండలం, నీలం పేట గ్రామంలో 32వ రోజు జనంతో జనసేన

ఆముదాలవలస: బూర్జ మండలం, నీలంపేట గ్రామములో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో, కొణిదెలు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా 32వ రోజు, బూర్జ మండలం, నీలం పేట గ్రామములో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది.. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సైరుగాపు సంతోషనాయుడు, మహేష్, కిరణ్, కోమల్, అనిల్, మోహన్, ప్రదీప్ మరియు జనసేన కార్యకర్తలు, మరియు నీలం పేట గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు జనసేన తరపున ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ధన్యవాదాములు తెలియజేసారు.