తాళవలస గ్రామంలో 34వ రోజు జనంతో జనసేన

  • జనంతో జనసేన కార్యక్రమంతో జనంలోకి దూసుకెళ్తున్న ఆమదాలవలస జనసేన

ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో, జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనంతో జనసేన 34వ రోజు కార్యక్రమంలో భాగంగా గురువారం ఆముదాలవలస మండలం, తాళవలస గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది.. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జయరాం, కిరణ్, కోమల్, మహేష్, పృధ్వీ, రుద్ర దీప్, అనిల్, మోహన్, ప్రదీప్, జనసేన కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా జనసేన తరఫున ధన్యవాదాములు తెలియజేశారు.