జాడుపూడి జనసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ఇచ్చాపురం: జాడుపూడి జనసైనికుల ఆధ్వర్యంలో గురువారం జెమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి ఉచిత మందులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, లోళ్ళ రాజేష్, ఆబోతు కూర్మా రావు, కోర్లాం రవి, శాంత రావు, హరీష్, గ్రామ పెద్దలు మరియు జాడుపూడి యువత హరీష్, రమేష్, నవీన్, దీనబంద్, మణి, రుషి పాల్గొన్నారు.