3వ డివిజన్ నిర్మలానంద నగర్ నందు 30వ రోజు మహిళలతో మాటామంతి

అనంతపురం, మంగళవారం జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ మహిళా కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా 30వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని స్థానిక 3వ డివిజన్ నిర్మలానంద నగర్ నందు పర్యటించి మహిళలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ఏ ఒక్క నిర్ణయాన్ని స్థిరంగా తీసుకోకుండా ఎక్కడా పరిశ్రమలను అభివృద్ధి చేయకుండా యువతకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసారని జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను గంజాయి వనంగా మార్చి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజలంతా ఆలోచించి జనసేన-టీడీపీ పార్టీలకు ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర అభివృద్ధి బాధ్యత, యువత ఉజ్వల భవిష్యత్తు అందించే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుంటారని, వీటితో పాటు స్థానిక డివిజన్ లో మురుగు కాలువల సమస్య, దోమల బెడద, మంచి నీటి సమస్య అధికంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.