మురుగ కుటుంబ సభ్యులకు 5 లక్షల భీమా చెక్కు అందజేత

చిత్తూరు, జనసేన పార్టీ చిత్తూరు రూరల్ అధ్యక్షుడు మురుగా రాయల్ మరణించడంతో వాళ్ళ కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ చేయూత. చిత్తూరు నియోజకవర్గ రూరల్ మండల అధ్యక్షులు మురుగ చనిపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం, పార్టీ పిఏసి సభ్యులు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ చే మురుగ కుటుంబ సభ్యులకు క్రియాశీలక సభ్యత్వ 5 లక్షల రూపాయల భీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ సభ్యులు మరియు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.