జనం కోసం జనసేన 541వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనం కోసం జనసేన 541వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం, గుర్రప్పాలెం పంచాయతీ, బలభద్రపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 300 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 87810 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 542వ రోజు శనివారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, బలభద్రపురం గ్రామం నుండి సీదిరి విష్ణుమూర్తి, యర్రా గణేష్, ముమ్మన అశోక్ కుమార్, పప్పల శివరామ్, యర్రా మణికంఠ, పెంటకోటి వీర వెంకట దుర్గ, పప్పల విష్ణు, సీదిరి సాయి బాబు, గెంతుకూరి రాంబాబు, కర్ణం సూర్యావతి, పప్పల త్రిమూర్తులు, జగ్గంపేట నుండి లంకపల్లి అజయ్(బన్ను), సగరపేట నుండి గాది పెద్దఅప్పన్న, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, బలిజ మణికంఠ, నకిరెడ్డీ నాగు, కృష్ణాపురం నుండి అమరపల్లి శ్రీనివాస్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.