జనం కోసం జనసేన 558వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనం కోసం జనసేన 558వ రోజులో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం సోమవారం గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 700 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 93260 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 559వ రోజు మంగళవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి దమపతులు తెలిపారు. సోమవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి సింగులూరి రామ్ దీప్, గండేపల్లి మండల కార్యదర్శి బలిరెడ్డి గణేష్, మల్లేపల్లి నుండి వెలిది చిన్న, దార్లంక వీరబాబు, తెమ్మనబోయిన రాజు, గొల్లపిల్లి విజయ్(పండు), రామకుర్తి వాసు, వల్లభశెట్టి నాగు, తాళ్లూరు నుండి ఆరుగొల్లు రామిరెడ్డి, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, పాటంశెట్టి చిన్న రామకృష్ణ, కొల్లుమళ్ళ శ్రీను, పెసల తాతాజీ గారికి, కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, కృతజ్ఞతలు తెలిపారు. జగ్గంపేట ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర శ్రీ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పాల్గొంటారు, పాటంశెట్టి శ్రీదేవి నియోజకవర్గంలో జనం కోసం జనసేన కార్యక్రమం కొనసాగిస్తారని తెలియజేయడం జరిగింది.