ప్యాకేజీల మీద నడిచే పార్టీ వైసీపీ పార్టీ: తిరుపతి అనూష

విజయవాడ వెస్ట్: ప్యాకేజీల మీద నడిచే పార్టీ వైసీపీ పార్టీనే వెల్లంపల్లి శ్రీను అంటూ జనసేన పార్టీ 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష పేర్కొన్నారు. శనివారం ఆమె వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీను వ్యాఖ్యలను ఖండిస్తూ.. విలేకరులతో మాట్లాడారు.. ప్యాకేజీల మీద నడిచే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ. ఎందుకు అంటే ప్యాకేజీ ఇస్తే తండ్రిని, బాబాయిని చంపిన వాళ్ళనైనా చట్టసభలకు పంపిస్తారు.. ఇలాంటి మీకన్నా పెద్ద ప్యాకేజీ పార్టీ ఇంకేదైనా ఉంటుందా..? వెల్లంపల్లి శీను గారూ పవన్ కళ్యాణ్ గారిని తిట్టటంతో రాబోయే ఎలక్షన్స్ లో మీకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్ ఇస్తారని మీ ఎదవ తెలివితేటలు ఉపయోగిస్తూ పిచ్చి కుక్కలాగా మా పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తారు. అదేవిధంగా బ్రో సినిమా ప్లాప్ అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లుఇస్తున్నారు మీరు. బ్రో సినిమా 100 కోట్ల క్లబ్ లో ఉందని చెప్పి సినీ వర్గాలు చెప్తున్నాయి తెలుసా నీకు. 4,5 రోజులలో 100 కోట్లు రావడం అంటే ఎంత మంది ప్రజల ఆదరించాలో తెలుసా మీకు.. ఎంత హిట్ టాక్ వస్తే ఆ వంద కోట్లు వస్తాయో తెలుసా నీకు.. అంటే నీకు లాగా రాత్రికి రాత్రి దేవాలయ భూములు, దోచుకున్నట్టు అనుకుంటున్నావా ఏంటి 100 కోట్లు రావడం అంటే..? లేకపోతే నీ పదవి అడ్డం పెట్టుకుని వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేసి సంపాదించడం అనుకుంటున్నావా..? కంగారు పడకు ఊసరవెల్లి నీకు త్వరలోనే ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని అనూష తెలిపారు.