ఉప్పలపాడు గ్రామంలో జనం కోసం జనసేన 566వ రోజు

జగ్గంపేట: జనం కోసం జనసేన 566వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం మంగళవారం గండేపల్లి మండలం, ఉప్పలపాడు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 750 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 97210 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 567వ రోజు కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంట వరకు జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. మంగళవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి తమటం నాగేంద్ర, గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి అంకం సూరిబాబు, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి సింగం శ్రీనివాస్, ఉప్పలపాడు నుండి గ్రామ అధ్యక్షులు తిరణాల శ్రీమన్నారాయణ, అంకం ఓమ్ కృష్ణ, కాటమళ్ళ నాగేంద్ర, అంకం సుబ్రహ్మణ్యం, కోరుకొండ రాంపండు, దొడ్డ నాగబాబు, అడపా సూర్య పవన్, నల్లమిల్లి శ్రీనివాస్, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నానిలకు శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.