రాజంపేటలో విజయవంతంగా 60వ రోజు పవనన్న ప్రజాబాట

రాజంపేట: పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాలతో కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం విజయవంతంగా 60 రోజులు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజంపేట మండలంలోని బోయనపల్లె, ఎర్రబల్లె, లక్ష్మీపురం, సిద్దులపల్లె గ్రామాలలో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలనుప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు తాళ్లపాక శంకరయ్య మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేకత విధానాలను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ప్రజల సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలంటే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రావాలని ఆయన అన్నారు. వచ్చే 2024 సంవత్సర ఎన్నికల్లో ప్రజలంతా జనసేన పార్టీకి మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాలనందిస్తున్న జనసేన నాయకులు తాళ్లపాక శంకరయ్య