జనం కోసం జనసేన మహాయజ్ఞం 656వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 656వ రోజు కార్యక్రమం సోమవారం గోకవరం మండలం, రంప యర్రంపాలెం గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 657వ రోజు కార్యక్రమం మంగళవారం గోకవరం మండలం, గోకవరం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల ప్రధాన కార్యదర్శి అల్లాడ త్రిలోక్ కుమార్, రంప యర్రంపాలెం నుండి గ్రామ గౌరవ అద్యక్షులు గుల్లింకల చిట్టిబాబు(నాని), బూత్ కన్వీనర్ సూరపురెడ్డి రామకృష్ణ, గ్రామ ఉపాధ్యక్షులు ఊడి దుర్గాప్రసాద్, గంటా శ్రీను, గంటా తేజ, కోన అరుణ్ కుమార్, పడాల వీరబాబు, వీరలంకపల్లి నుండి గ్రామ అధ్యక్షులు మామిడిపల్లి నాగేశ్వరరావు, నంగిరెడ్డి నరసింహారావు, ద్వారపూడి నరసారావు, జె.కొత్తూరు నుండి అయితిరెడ్డి ఏసుబాబు, గోనేడ నుండి వల్లపుశెట్టి నానిలకు కృతజ్ఞతలు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా రంప యర్రంపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గుల్లింకల చిట్టిబాబు(నాని) కుటుంబ సభ్యులకు, గంటా శ్రీను కుటుంబ సభ్యులకు, నవనాసి విష్ణు కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.