జన చైతన్య శంఖారావం 28వ రోజు

రాజమండ్రి రూరల్: జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తలపెట్టిన జన చైతన్య శంఖారావం కార్యక్రమం 28వ రోజు ధవలేశ్వరం గ్రామంలో కొత్తపేట ఏరియాలో ప్రారంభించారు. ఈ సందర్భగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ప్రారంభించిన మొదటి రోజు నుంచి ఈ కార్యక్రమం ఏ గ్రామంలోకి వెళ్లిన ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఈ ప్రభుత్వం ఏ సమస్యలను కూడా పరిష్కరించలేకపోవటం, పెద్ద పెద్ద సమస్యలను పక్కన పెట్టేస్తే మౌలిక సదుపాయాలపై ఏ రకమైన శ్రద్ధ చూపడం లేదు. ధవళేశ్వరం లాంటి పెద్ద గ్రామాలు ఎక్కడా కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు, రోడ్లు బాలేదు, రాత్రులు రోడ్డుమీద వెళ్లాలంటే పైన లైట్లు ఉండవు. రోడ్లమీద డ్రైనేజీ వాటర్ వచ్చేస్తాయి. మాకు ఈ ప్రభుత్వం కనీస సమస్యలను పరిష్కరించేటట్లు కనిపించడంలేదని, ప్రజలలో అసహనం కల్పిస్తుంది. పనులు చేయరు, ఓట్లు సమయంలో వస్తారని అంటున్నారని దుర్గేష్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేలంశెట్టి బాబి, లంకి శ్రీను, అల్లంపల్లి గోవింద్, గోవింద్, ఆటో బుజ్జి, ఏజిఅర్ నాయుడు జిల్లా కార్యదర్శి బీర ప్రకాష్, కార్యదర్శి అమీనా, మట్టపర్తి నాగరాజు, దూది సాయి, సురాడ సత్తిబాబు, శివాజీ సునీల్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.