కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

కైకలూరు నియోజకవర్గ 4 మండలాల జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం మండవల్లిలోని శుభమ్ ఫంక్షన్ హాల్ నందు శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రియతమ నాయకులు కృష్ణ, జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ(రాము) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మండవల్లి సెంటర్ నందు నియోజకవర్గ జనసైనికులు నాయకులు బండ్రెడ్డి రామ్ కి ఘనంగా స్వాగతం పలికారు. తదనాంతరం సెంటర్లో ఉన్న డా.బి ఆర్ అంబేద్కర్ మరియు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండవల్లి గ్రామం నందు ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని అధ్యక్షులు వారి చేతులు మీదగా సేవలు మొదలుపెట్టారు. అనంతరం ఫంక్షన్ హాల్ కి చేరుకొని కైకలూరు నియోజకవర్గ నాయకులను జనసైనికులను దిశానిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో బండ్రెడ్డి రామ్ మాట్లడుతూ రాబోయే ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గ గడ్డపై జనసేన పార్టీ జెండా ఎగరవేస్తాం అని ధీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో కృష్ణ జిల్లా ఉపాధ్యక్షలు మత్తి వెంకటేశ్వర రావు, చౌదరి, రాష్త్ర కార్యదర్శి లీలా కనక దుర్గ, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిపురపు రాజబాబు, కార్యదర్శి బి.వి రావు , సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, జనసేన పార్టీ కృష్ణా జిల్లా కార్యవర్గం, ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వేంకటేశ్వరరావు, మండవల్లి మండల అధ్యక్షురాలు బోయిన ప్రశాంతి, కైకలూరు మండల అధ్యక్షులు ముమ్మారెడ్డి నగమల్లేశ్వర రావు, కలిడింది మండల అధ్యక్షులు బెల్లంకొండ బాబు, నియోజకవర్గ నాయకులు నల్లగోపుల చలపతి, కొల్లి బాబీ, పోకల కృష్ణా, తోట లక్ష్మీ, మోటేపల్లి హనుమా ప్రసాద్, వర్రే హనుమా, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గున్నారు.