దామలచెరువు జనసేన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ సంబరాలు

దామలచెరువు జనసేన కార్యాలయంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ సంబరాలు జరిగాయి. భారత ఆర్మీ జవాన్లు, గ్రామ పెద్దల చేతుల మీదుగా మువ్వన్నెల జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్లు, గ్రామ పెద్దలు, చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం నాసిర్, పాకాల మండలం ఉపాధ్యక్షులు దినేష్, జనసేన నాయకులు నౌమూన్, పాకాల మండల ప్రధాన కార్యదర్శి రహంతుల్లా, వాసు రాయల్ పాకాల మండల కార్యదర్శి షాజహాన్, పాకాల మండల సంయుక్త కార్యదర్శి హరి, మస్తాన్, చంద్ భాష మరియు గ్రామ ప్రజలు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.