33వ వార్డు లో నా సేన కోసం నా వంతు కార్యక్రమం

విశాఖపట్నం, దక్షిణ నియోజకవర్గం 33వ వార్డు లో శనివారం సాయంత్రం దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపికృష్ణ (జి.కే) ఆధ్వర్యంలో నా సేన కోసం నా వంతు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఫైనాన్షియల్ కమిటీ సభ్యులు తిప్పల రమణారెడ్డి విచ్చేయడం జరిగింది. అలాగే విశాఖ జిల్లా లీగల్ సెల్ చైర్ పర్సన్ ఎర్ర రేవతి మరియు ఉత్తరాంధ్ర ప్రాంతీయ కోఆర్డినేటర్ త్రివేణి మరియు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంత లక్ష్మి మరియు కార్పొరేటర్ అభ్యర్థులు యజ్ఞశ్రీ, త్రినాధ్, తెలుగు అర్జున్ సీనియర్ జనసేన నాయకులు నీలం రాజు, రఘు, అరుణ్ అలాగే దక్షిణ నియోజకవర్గం వీర మహిళలు జనసైనికులు జనసేన కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.