శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల సమక్షంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పట్టణంలోని వినుత నివాస గృహం వద్ద నిర్వహించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వినుత కోటా మాట్లాడుతూ 77 సం.రాలుగా దేశ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చినా నిజమైన స్వాతంత్య్రం రాలేదని, పాలకుల చేతిలో మన దేశ చట్టాలు బలవంతులకు బలహీనంగా, బలహీనులు బలవంతంగా పని చేస్తున్నాయి, పట్ట పగలే మహిళలు రోడ్డు పైన నడవాలంటే అభద్రతా భావం ఉందని, ముఖ్యంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో చట్టాలను ఉల్లంఘిస్తూ వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తూ అరాచక పాలనను కొనసాగిస్తున్నారు, రాజ్యంగ విలువలను తుంగలో తొక్కి రాక్షస పాలనను చేస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలో వస్తే తప్పకుండా నిజమైన స్వాతంత్య్రం ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు చూపుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కావలి శివ కుమార్, తోట గణేష్, అరిగెల వేణు గోపాల్, వెంకట రమణ యాదవ్, ముడుసు గణేష్, తులసి రామ్, ధ్రువ కుమార్, వెంకటేష్, చెంచు ముని, మహేష్, శివ, చైతన్య, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.