జనవాణిని విజయవంతం చేయలని పిలుపునిచ్చిన బంగారు రామదాసు

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం ప్రజలకు నా యొక్క నమస్కారములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ విశాఖపట్నం లో 15, 16, 17 తేదీలలో పార్టీ అధ్యక్షులు పర్యటన చేస్తూ 15వ తేదీన జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ముఖ్యమైన నాయకుల సమావేశం జరుగును. 16వ తేదీన విశాఖపట్నం పోర్ట్ కళావాణీ ఆడిటోరియం దగ్గర గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు వారు జనవాణి కార్యక్రమము చేపడతారు. ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుందని కార్యక్రమంలో అరకు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా జనసేన పార్టీ నాయకులు ద్వారా కానీ మీ వ్యక్తిగత సమస్య ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సమస్య ద్వారా మీకు పరిష్కారం కాని ఎడల జనసేన పార్టీ అధ్యక్షులు వారికి మీరు స్వయంగా వచ్చి అర్జీ అందించవచ్చని అలాగే మన ప్రాంతం మన యొక్క చుట్టుపక్కల సమస్య ఉన్న మీరు వినతిపాత్రంతో అర్జీ పత్రము పట్టుకొని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దగ్గర స్వయంగా అందించవచ్చు ప్రతి ఒక్కరూ గమనించి ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వము చేస్తున్నటువంటి కొన్ని ఇబ్బందులు అంటే మీ వ్యక్తిగత సమస్యల కొరకు అధ్యక్షులు వారికి మీరు తెలియపరచవచ్చు అలాగే అరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్య కొరకు ముందు వచ్చి మేము వినతిపత్రం అర్జీ అందిస్తాం అన్న సహోదరులు సంఘ కార్యకర్తలు సంఘపు వాళ్లు ఎవరైనా సహోదరులు నా బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు విశాఖపట్నంలో రావాలని కోరుచున్నాము 16వ తేదీ సాయంత్రం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా జన సైనికులకు వీరమహిళలకు శ్రీకాకుళం వారికి మీటింగ్ ఏర్పాటు సమీకరణ ఉంటుంది 17వ తేదీన విజయనగరం జిల్లా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు దిశానిర్దశ సమీకరణ ఏర్పాటు చేస్తారు కావున జన సైనికులకు వీర మహిళాలకు నా హృదయపూర్వక అరకు నియోజకవర్గంలో ఉన్న వారికి ఆహ్వానము ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే మీ యొక్క సమస్య కొరకు అరకు నియోజకవర్గ ప్రజల యొక్క సమస్య కొరకు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవమైన పవన్ కళ్యాణ్ దృష్టి మేర తీసుకెళ్లే ప్రయత్నం. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అరకు నియోజకవర్గ జనసేన నాయకులు బంగారు రామదాసు పిలుపునిచ్చారు.