అవనిగడ్డలో జనం కోసం జనసేన 8వ రోజు

అవనిగడ్డ నియోజకవర్గం: అవనిగడ్డ టౌన్ కమిటీ అధ్యక్షులు రాజనాల వీరబాబు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన 8వ రోజు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అవనిగడ్డ రెండో వార్డులో అవనిగడ్డ నియోజకవర్గ ప్రజల దగ్గరకు వెళ్లి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో.. ఆ ఆశయాలను వివరిస్తూ స్థానిక ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన పార్టీ ఆవశ్యకతను, క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీహరి, మరో అవనిగడ్డ మండల ప్రధాన కార్యదర్శి భోగిరెడ్డి నాగేశ్వరరావు, అవనిగడ్డ టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు రాజనాల వీరబాబు, అవనిగడ్డ టౌన్ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందు బాబు, అవనిగడ్డ టౌన్ ఉపాధ్యక్షులు గూగుల్ కిరణ్ నాయక్, అవనిగడ్డ టౌన్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అన్నపురెడ్డి ఏసుబాబు, తోట శీను తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.