జోగి రమేష్ ని ప్రజలు భోగిమంటల్లో కలిపే రోజు త్వరలోనే ఉంది

  • మీ నాయకుడికి హైదరాబాదులో, బెంగళూరులో ప్యాలెస్ లు లెవా..?
  • మీకు దమ్ముంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మా జన సైనికులు మీద గెలవండి.. డిపాజిట్లు కూడా రావు మీకు

విజయవాడ: జోగి రమేష్ ని ప్రజలు భోగిమంటల్లో కలిపే రోజు త్వరలోనే ఉందని విజయవాడ 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష పేర్కొన్నారు. శుక్రవారం అనూష విలేకరులతో మాట్లాడుతూ.. వాలంటీర్లు మీ కార్యకర్తలని ఒప్పుకున్నారుగా.. మా నాయకుడు చెప్పేది కూడా అదే వాలంటీర్లు అందరూ వైసిపి కార్యకర్తలుగా పనిచేసి ప్రజలు డేటాని సేకరించి మిస్యుజ్ చేస్తున్నారనే ప్రశ్నిస్తున్నారు.. దమ్ముల గురించి తర్వాత మాట్లాడండి.. మీకు లాగా నియోజకవర్గానికి 10,15 కోట్లు ఖర్చు పెడితే మీ మీద ఇక్కడ సొరంగంలో కూర్చున్న వాళ్ళని పెట్టి గెలిపిస్తాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.. మీకు మీ నాయకుడికి జగన్ గారికి దమ్ముంటే ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఎలక్షన్ కి రండి.. మీకు మీ నాయకుడికి దమ్ముంటే మద్యపానం నిషేధం చేసి రండి ఆ తర్వాత దమ్ముల గురించి మాట్లాడండి. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి, అదే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో అరాచకాలు చేస్తున్నా మీ అందరికీ ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్తారని అనూష హెచ్చరించారు.