పోలవరంలో జనం కోసం జనసేన 92వ రోజు

పోలవరం: కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామంలో మండల అధ్యక్షులు తోట రవి మరియు గ్రామ అధ్యక్షులు గేలం భాస్కర్ ఆధ్వర్యంలో జనం కోసం జనసేన 92వ రోజు కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజుకి జనసేన తెలుగుదేశం పార్టీల కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి అవసరాలు వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగారు. ఇల్లు లేని లబ్ధిదారులకు ఇల్లు ఇస్తామని చెప్పి వారికి ఇల్లు కట్టి ఇవ్వకపోగా వారికి నోటీసులు ఇవ్వడాన్ని బాలరాజు తప్పుపట్టారు. ఎప్పటినుంచో పొంగుటూరు రోడ్డు సమస్యను తీర్చమని ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా, అధికారులు అధికార నాయకులు కనీసం పట్టించుకోని స్థితిలో ఉన్నారని, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక వర్షాకాలంలో మరెన్నో ఇబ్బందులు పడుతూ అనేక రకాలైన వ్యాధులకు గురవుతున్నారని, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల కూటమిలో అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలు తీర్చే ధ్యేయమై లక్ష్యంగా పనిచేస్తామని, ఒక్క అవకాశం ఇవ్వాలని, అధికారంలో లేకుండానే నాలుగేళ్లలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని అధికారం వస్తే ఇంకా ఎన్నో చేసి చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాదం కృష్ణ, మాదేపల్లి శ్రీనివాస్, ఏపూరి సతీష్, ప్రగడ రమేష్, ప్రగడ సురేష్, అడపా సుబ్బారావు, పసుపులేటి రామారావు, యండ్రపాటి వెంకట్, వరి కోటి ప్రకాష్, ప్రగడ లక్ష్మణ్ దొర, పసుపులేటి రాజు, మద్దాల శ్రీను, మండల కమిటీ మరియు గ్రామ కమిటీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.