షుగర్ వ్యాధి బాధితురాలికి జనసేన ఆర్థిక సహాయం

అమలాపురం సాయి విశ్వాస్ హాస్పిటల్ లో మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామవాసి కాలు షుగర్ వ్యాధితో చికిత్స పొందుతున్న మల్లవరపు దయామణి కాలు తొలగించడం జరిగినది. ఈ సందర్భంగా ఆమె ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా జనసేన పార్టీ తరపున ఆమెకు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మామిడి కుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాత కాపు నగరం ఏఎంసీ మాజీ చైర్మన్ కొమ్ముల కొండలరావు ఎంపీటీసీ కొమ్ముల జంగమయ్య మండల జనసేన పార్టీ నాయకులు మంద గాంధీ, కొమ్ముల భద్రం, అడబాల చిన్ని తదితరులు పాల్గొని ఆమెకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగినది.