జనసేన జన జాగృతి యాత్ర 95వ రోజు

  • జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూనవరం గ్రామంలో ప్రధానమైన మంచి నీటి సమస్య పై పోరాటం చెయ్యటానికి మేము సిద్ధం.. గురుదత్

రాజానగరం నియోజకవర్గం: జనసేన జనజాగృతి యాత్ర 95వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం సీతానగరం మండలం, కూనవరం గ్రామంలో 3వ రోజు మంగళవారం 700గాజు గ్లాసులు పంపిణి చెయ్యటం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 57,900 వేల గాజు గ్లాసులు పలు గ్రామాల్లో ఇవ్వటం జరిగింది. జనసేన జన జాగృతి యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ అధ్యక్షతన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా సరూప దేవి ఆధ్వర్యంలో దిగ్విజయంగా ముందుకు సాగుతూ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ జండా ఎగరేసే విధంగా ముందుకు సాగిపోతుంది.. గ్రామ గ్రామన ప్రతి ఇంటింకి వెళ్లి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రాలు ప్రజలకు అందిస్తూ.. జనసేన పార్టీని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.. ఈ కార్యక్రమంలో సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ వీరమహిళ కందికట్ల అరుణ కుమారి, చదువు ముక్తేశ్వరరావు, చదువు నాగేశ్వరరావు, గొల్లకోటి కృష్ణ, తన్నీరు తాతాజీ, కూనవరం జనసేన పార్టీ నాయకులు గేదల సత్తిబాబు, చిక్కాల నాగశ్రీను, అయ్యప్ప, ఉమ్మిడి శెట్టి సురేష్, కాళ్ళ రాము, వీరమహిళలు మరియు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.