త్రాగునీటి సమస్యపై జనసేన వినతి పత్రం

నెల్లూరు: కలువాయి మండలంలోని, వెంకటరామరాజుపేట గ్రామంలో మూడు చేతి పంపులు పనిచేయక త్రాగునీరు సమస్యతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై శనివారం కలువాయి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పెరంకొండ మనోహర్ ఆధ్వర్యంలో విస్తరణ అధికారి (పంచాయితీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి) డి.నారాయణ ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సమస్యపై వారు స్పందించి చేతి పంపుల సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు పువ్వాడి నరేష్, ప్రవళిక, సుసర్ల శ్రీహరి, భువన్ కుమార్ పాల్గొన్నారు.