బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరికలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామం నుండి మర్రిపూడి చిన్న ఆధ్వర్యంలో మరియు పెంటపాడు మండలం జనసేన అధ్యక్షులు పూళ్ళ బాబీ మరియు మర్రిపూడి సుబ్బారావు మరియు కలపాల సుధాకర్ సహకారంతో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ పార్టీ నుంచి దళితులు సుమారు 100 మంది జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ జాయినింగ్ లో కొల్లిరవి, మద్ద బాబురావు, బాతు కాంతారావు, బాతు బద్ర, కొల్లి పద్మ, కొల్లి రమేష్, కొల్లి శ్రీను, కొల్లి క్రాంతి, కొల్లి సంజయ్, బాతు పెదరాజు, ముక్కర యేసు, అంబతి కోటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు ఆడబాల నారాయణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాతి రాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికంఠ, జనసేన పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ముఖేష్, జనసేన నాయకులు చాపల రమేష్, మాదాస్ ఇందు, నీలిపాల దినేష్, ఏపూరి సాయి, దుర్గారావు మరియు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.