జనసేన గిరిసేన – జనం వద్దకు జనసేన 34వ రోజు

పాలకొండ, ఆదివారం జనసేన గిరిసేన – జనం వద్దకు జనసేన 34వ రోజు కార్యక్రమంలో భాగంగా మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం బొడ్లపాడు గ్రామంలో జనసేన పార్టీ తరఫున జనసేన జానీ జేమ్స్ హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం చేయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బొడ్లపాడు గ్రామ ప్రజలు వచ్చి కంటి చికిత్స చెకపు చేయించుకున్నారు. గ్రామ యువత మద్దతుగా ఉంటూ ఈ కార్యక్రమం జయప్రదం చెయ్యడం జరిగింది. జేమ్స్ హాస్పిటల్ సిబ్బంది వారు ఆప్తమాలజి టెక్నీషియన్స్ అప్పాలొండా భవాని, కడగల రమేష్, ఏరియా మేనేజర్, పి రాజేశ్వర్ రావు, అస్టింట్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.