వారాహి యాత్ర ను విజయవంతం చెయ్యండి

బొబ్బిలి: బుధవారం నుండి జనసేన పార్టీ అధినేత పవణ్ కళ్యాణ్ చేపట్టబోయే “వారాహి”యాత్ర విజయవంతం కావాలని మంగళవారం బొబ్బిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి నాయుడు ఆంజనేయస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన సమక్షంలో వారాహి యాత్ర పోస్టర్ల ను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉల్లి సంతోష్, జమ్మూ గణేష్, పైలా హరి ప్రసాద్, ప్రసాద్, సేపన శ్రీను బాబు (వైజాగ్) మరియు బొబ్బిలి జన సైనికులు పాల్గొనడం జరిగింది. తరువాత బొబ్బిలి జనసేన పార్టీ కార్యాలయంలో రేపటి నుండి జరగబోయే వారాహి యాత్ర గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.